AP: తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్రంలో చిలికి చిలికి గాలి వానలా మారింది. మీరు తప్పు చేశారంటే.. మీరు తప్పు చేశారని టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు తారా స్థాయికి చేరాయి. అయితే ‘లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు, కోట్ల మంది నమ్మకం. ఈ నమ్మకాన్ని కాపాడటం వదిలేసి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మంచిది కాదు. ఇప్పటికైనా ఆ వేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగొద్దు’ అని భక్తులు వేడుకుంటున్నారు.