VKB: తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన తాండూరు పట్టణం సాయిపూర్లో బుధవారం చోటుచేసుకుంది. ఇంటి యజమాని కుమ్మరి అంజలయ్య బంధువుల వివాహం ఉందని వారం రోజులు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 9 గ్రాముల బంగారం, 10 తులాల వెండి, రూ.50,000ల నగదును దొంగలించారని ఇంటి యజమాని తెలిపాడు.