భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ ఇరుదేశాల బంధానికి కొత్త శక్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో రెండు దేశాల ఆర్థిక, సాంకేతిక అభివృద్దికి మరింత ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు.