SDPT: ప్రభుత్వ పథకాలకు రాయతీలు లభించాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి సరూప రాణి అన్నారు. జిల్లా పరిధిలోని రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా, మీసేవ కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పంట బీమా, సబ్సిడీలు అందుతాయన్నారు.