KNR: ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలోని బస్ స్టేషన్లు, డిపోలలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని జోన్ ఈడీ పగిడిమర్రి సోలమన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వేసవి దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.