జపాన్ను భూకంపం మళ్లీ వణికించింది. అయోమోరి తీరంలో ఇవాళ ఉదయం 6.7 తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సముద్రం దరిదాపుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఇటీవల (సోమవారం) ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. వరుస భూకంపాలతో జపాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.