GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో పట్టాభిపురం మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 55 మసీదుల మౌజాన్లు, ఇమామ్లకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బట్టలు, అవసరమైన సరుకులను అందజేశారు. ముస్లిం సోదరుల అంత్యక్రియల కోసం జనాజా వాహనాన్ని రెండు వారాల్లో అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.