ADB: నార్నూర్ మండల కేంద్రంలో పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని పంచాయతీ కార్యదర్శి కుమ్ర మోతిరాం అన్నారు. ఆయన మంగళవారం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్మికుల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయడం చేపట్టారు. వేసవి కాలం ప్రారంభమైన సందర్భంగా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.