నిర్మల్: జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ రామాలయంలో ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన కరపత్రాలను 9 వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన అర్చకులు రామానుజ చార్యులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.