కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. స్పాట్ బుకింగ్ పెంచుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భక్తుల రద్దీని బట్టి బుకింగ్ పెంచుకోవచ్చని సూచించింది. అయితే, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పేర్కొంది.