నారాయణపేట పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తేవాలని అహ్మద్ యూసఫ్ తాజ్ కోరారు. సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ఫణిందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొత్త ఆసుపత్రి దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. పాత ఆసుపత్రిలో ఓపీతో పాటు అత్యవసర సేవలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.