WNP: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు శనివారం DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల హాల్ టికెట్లను కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.