NTR: మైలవరం నియోజకవర్గ వైసీపీ పరిశీలకురాలిగా విజయవాడ కార్పొరేటర్ బండి పుణ్యశీలను నియమిస్తూ వైసీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇబ్రహీంపట్నంలో నివాసముంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ని సోమవారం వైసీపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెను జోగి రమేష్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.