ADB: ఇందిరమ్మ గృహ అర్హులను L2, L3 నుంచి L1 జాబితాలోకి మార్చి అర్హులకు లబ్ధి చేకూర్చాలని టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ అన్నారు. సంబంధిత సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. RDO స్రవంతిని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. L2, L3 ఉండటం వలన నిరుపేదలైన వారికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.