KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇవాళ పంపిణీ చేశారు. మూడు మండలాలు, పట్టణానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.10,35,356 విలువైన చెక్కులు అందజేశారు. గత 20 నెలల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 249 మందికి రూ.1.96 కోట్ల ఆర్థిక సహాయం అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు.