SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామ శివారులో సోమవారం వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా, జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం మునగాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.