BDK: మణుగూరు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అద్దంకి నరేష్, సీఐ నాగబాబు, ఎంపీవో పల్నాటి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.