AP: వేద పండుతుల పోస్టుకు డబ్బులు వసూలు దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని.. తమ హయాంలో 700 పోస్టులు మంజూరు చేశామన్నారు. 4 నెలల ముందు ఇంటర్వ్యూలు జరిగినా ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించలేదని తెలిపారు. తప్పులు చేస్తున్నారు కాబట్టే భయపడుతున్నారని.. BR నాయుడు ఆధ్వర్యంలో అరాచకం జరుగుతోందని ఆరోపించారు.