కృష్ణా: వేసవి దృష్ట్యా త్రాగునీటి కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. ఆదివారం చల్లపల్లిలోని పుట్ట బజారులో ఉన్న పంప్ హౌస్ వద్ధ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రెండు నూతన బోర్లు వేసే పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. పంచాయతీ ఈవో పీవీ మాధవేంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.