BHNG: ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ ఆదిజాంభవ మఠంలో జాంభవంతుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగర గ్రామ మాదిగ కమ్యూనిటీ సభ్యుల సహకారంతో విగ్రహ ఆవిష్కరణ కోసం రూ.12,000లను చందాగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాతలను ఘనంగా సన్మానించారు.