అన్నమయ్య: పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా జిల్లా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా SP ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు మహిళల భద్రత కోసం ‘శక్తి టీమ్స్’, దొంగతనాల నివారణకు ప్రత్యేక క్రైమ్ టీమ్స్ను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు.