MBNR: రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్ననగర్ నుంచి వస్తున్న ఓ కారు, బైక్ను ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలాగే మరో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.