VZM: బొబ్బిలి శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఇవాళ ఎమ్మెల్యే బేబీ నాయన తైక్వాండో మీట్ ప్రారంభించారు. తైక్వాండో కోచ్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మీట్లో సుమారు 100 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సంస్థల అధినేత మర్రాపు నాని, చింతా శారద కలవరాయ, తదితరులు పాల్గొన్నారు.