SRD: నవ్య రోడ్డు లో నిర్మిస్తున్న ముదిరాజ్ భవనం నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన భవనం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవనం సమీపంలోనే నిర్మిస్తున్న ఆంజనేయస్వామి, అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా దేవాలయ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.