W.G: ఆచంటకు చెందిన YCP నాయకులు ఆదివారం కోనసీమ జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మాక్వానాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆచంట నియోజకవర్గంలోని దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీతారాం, వెంకటేశ్వరరావు, దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.