SKLM: రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో వైసీపీ నాయకులు ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైసీపీ అధ్యక్షులు గొర్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అదేవిధంగా ఈనెల 28న ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు.