NLG: అమెరికా సామ్రాజ్యవాద ధోరణులు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ పట్టణంలోని స్టడీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ అనే పుస్తకాన్ని ఆయన విశ్లేషించారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.