VZM: బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్గా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ నియమితులయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు అదనంగా బుడా వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు, మూడు రోజుల్లో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.