NTR: బూడిద టెండర్ రద్దు చేయాలనీ 37 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్న లోకల్ లారీ ఓనర్లు, డ్రైవర్లు దీక్షలు విరమించారు. వారి చేత MLA వసంత కృష్ణప్రసాద్ శనివారం దీక్షలను విరమింప చేశారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని వారి పోరాటానికి ప్రత్యక్షంగా అండగా నిలిచినట్లు తెలిపారు.