HYD: రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో TGPSC ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్-1 సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి సీతక్క, ఉమెన్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శోభారాణి స్వయంగా అందజేశారు. వేల మందితో పోటీ పడి కొలువులు సాధించిన వారిని మంత్రి అభినందించారు. త్వరలోనే 14 వేల అంగన్వాడీ టీచర్లను నియమిస్తామని సీతక్క చెప్పారు.