TG: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో హుజుర్ నగర్ పట్టణంలో 259 కంపెనీలు తీసుకుని వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఇవాళ నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 3041 మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు. మొత్తం 4574 మందికి ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.