ELR: చింతలపూడి మండలం నామవరంలో ఎక్సైజ్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. గొగ్గులోతు రంగమ్మ వద్ద 2 లీటర్లు నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు అబ్దుల్ ఖలీల్, జగ్గారావు, సిబ్బంది ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.