NLR: కర్నూలు జిల్లా బస్సు దుర్ఘటన మరవక ముందే, పొదలకూరు మండలంలోని మర్రిపల్లి వద్ద మరో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బెంగుళూరు కి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శనివారం రాత్రి అకస్మాతగా పొగలు వచ్చాయి. దీంతో బస్సును ఆపివేశారు. ప్రయాణికులు వెంటనే అందులో నుంచి బయటపడినట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.