GNTR: గుంటూరులోని పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న కొరిటెపాడుకు చెందిన సురేష్ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్కు తీవ్ర గాయాలై, ఒక కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.