SKLM: మాజీ సీఎం జగన్ అవాస్తవాలను మాట్లాడుతున్నారని శ్రీకాకుళం MLA గొండు శంకర్ అన్నారు. MLA క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా ఎదుట ఆయన మాట్లాడారు. జగన్ పరిపాలనకు విసిగిన ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకు వస్తున్న పీపీపీ విధానంపై జగన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని, దేశంలో పలు నిర్మాణాలను ఈ పద్ధతిలో కట్టారన్నారు.