TPT: మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే SI హరిచందన మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, మృతుడి వయసు 38 ఏళ్లు ఉంటుందని, గ్రే కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు.