SKLM: స్థానిక డీసీసీబీ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని శనివారం సాయంత్రం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాల చార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా వేసి సత్కరించారు.