MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి కలెక్టర్ దివాకర్ టీఎస్, ITDA పీవో చిత్ర మిశ్రతో కలిసి శనివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు కొమురం భీం స్పోర్ట్స్ స్టేడియం వద్ద స్థలం అనువైనదిగా గుర్తించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ITDA అధికారులు ఉన్నారు.