SKLM: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంచుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని దండి వీధిలో శ్రీరామ మందిర నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఆధ్యాత్మిక భావాలతో అందరిలోనూ ఐకమత్యం జరుగుతుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహాయం అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.