న్యూజిలాండ్తో జరగనున్న ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్య మాట్లాడుతూ.. తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోరు చేస్తామనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అన్నాడు. అయితే గతంలో తమ జట్టు 250 పైచిలుకు భారీ స్కోర్లను సాధించినట్లు గుర్తు చేశాడు.