BHNG: భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రాజ్ భవన్ ముట్టడి సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. త్వరలోనే తనపై ఉన్న ఈ కేసులను కోర్టు కొట్టివేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.