NDL: నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం కలిశారు. ఆయన కార్యాలయంలో నంది కొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల, ముచ్చుమర్రి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రికి అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.