JGL: గొల్లపల్లి మండలంలోని రంగదామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ‘ప్రజా పాలన-పల్లె ప్రగతి’ పనులను సర్పంచ్ అఖిల ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు నీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.