VSP: జాలరిపేట 19వ వార్డులో జీవీఎంసీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26’లో భాగంగా ఇవాళ అవగాహన వీధి నాటకం నిర్వహించారు. చెత్త విభజన, ప్లాస్టిక్ నిషేధం, హోమ్ కంపోస్టింగ్ వంటి అంశాలపై కళాకారులు ప్రజలకు చైతన్యం కలిగించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అధికారులు కోరారు.