నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈవో రాములు తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం మండలంలో సిరికొండ, మోడల్ స్కూల్, వాల్గోట్, కొండాపూర్లలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.