KMM: రఘునాథపాలెంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పల్లె దవాఖానలోని వైద్య సేవలను ఆయన పరిశీలించారు. మార్చి 15లోపు పెండింగ్ దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.