ASR: అడవుల్లో మంటలు చెలరేగడం వల్ల సమస్త జీవజాలానికి, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆరకు రేంజ్ అటవీ అధికారి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆరకు సంతలో అటవీశాఖ ఆధ్వర్యంలో అడవులకు నిప్పు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. అడవులు ప్రకృతి సంపదగా ఉండి మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.