ATP: అనంతపురం కలెక్టరేట్లో ‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్’ 5కే రన్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8వ తేదీన ఈ పరుగు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజేతలకు రూ.11వేలు ప్రథమ బహుమతితో పాటు పలు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.