NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యాచరణలో భాగంగా శుక్రవారం చిట్యాల మండలం, వట్టిమర్తి గ్రామ పంచాయతీలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీపీ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. సర్పంచ్ మేడి శ్రీలత, ఉపసర్పంచ్ బెల్లి భవాని, కార్యదర్శి పరమేష్, వార్డు సభ్యులు అనంతరెడ్డి, మేడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.