జవాన్ల త్యాగం వృథా కానివ్వమని. నక్సలైట్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీఎం భూపేష్ చెప్పారు. కాగా, అమర జవాన్ల మృత దేహాలను వాహనాలలో స్వస్థలాలకు తరలించే సమయంలో సీఎం ఒక జవాన్ శవపేటికను తన భుజంపై మోశారు.
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని జిల్లాలో నక్సలైట్లు మందుపాతర పేల్చడంతో 10 మంది జవాన్లు, ఒక బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) మృతులకు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా సీఎం ఓ శవపేటికను మోశారు. జవాన్ల మృతదేహాలను ఓ వాహనంలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఆ వాహనం వరకు ఆయన దానిని తీసుకెళ్లారు. ఈ సమయంలో జవాన్ల కుటుంబ సభ్యుల వేదన చూపరులను కంటతడిపెట్టించింది. భారత్ మాతాకీ జై నినాదాల మధ్య, జవాన్ల కుటుంబ సభ్యులు, పౌరుల కన్నీటి మధ్య మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు.
నిన్న దంతెవాడ(Dantewada)లో పోలీసులు ప్రయాణిస్తున్న మినీ బస్సును టార్గెట్ గా చేసుకొని ఐఈడీ మందుపాతర పేల్చారు నక్సలైట్లు. వీరు మావోయిస్ట్ వ్యతిరేక కూంబింగ్ ఆపరేషన్ కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ దాడి జరిగింది. ఈ రోజు అమరజవాన్ల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించిన అనంతరం సీఎం భూపేష్ మాట్లాడుతూ… జవాన్ల త్యాగం వృథా కానివ్వమని చెప్పారు. నక్సలైట్ల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు. మావోయిస్టుల (Maoists) ను మట్టుపెట్టేందుకు జరుపుతోన్న పోరును మరింత తీవ్రం చేస్తాం’అని వెల్లడించారు.